6, మార్చి 2009, శుక్రవారం

chandu

తెనాలి నియోజకవర్గము - చందు సాంబశివరావు గారి ఆవశ్యకత
గుంటూరు జిల్లాలో తెనాలి డివిజన్ నందు కాపు సమజికవర్గం అధిక సంఖ్యలో వున్నారు. కొత్తగా ఏర్పడిన రేపల్లె, బాపట్ల, పొన్నూరు, వేమూరు, తెనాలి నియోజకవర్గాలలో కాపులు అధికంగా వున్నారు.వీరు వీరు పోటీ చేసే పార్టీల బలాబలాలను ప్రభావితం చేసే స్థాయిలో వున్నారు.

తెనాలి డివిజన్ నుండి 1954 లో దుగ్గిరలనుండి వేమూరు నాగేశ్వరావు, 1955, 62, 67 లో రేపల్లె నుండి యడం చెన్నయ్య, 1985 లో బాపట్ల నుండి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, 2004 లో వేమూరు నుండి సతీష్ పాల్ రాజ్ గెలుపొందారు.తెలుగుదేశం పార్టీ 1985 లో బాపట్ల, 94, 99, 04 సంవత్సరాలలో కాపు అభ్యర్ధులకు దుగ్గిరాల నుండి సీటు ఇస్తున్నారు.

నేడు తెనాలి డివిజన్ నందరి రేపల్లె నందు కాపు సామజిక వర్గం ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వేమూరు S.C. రిజర్వుడు, రేపల్లె B.C. సామజిక వర్గాలకు ఇవ్వవలసి యున్నందున తెనాలి నియోజకవర్గాన్ని కాపులకు కేటాయిస్తే గెలవటానికి ఆస్కారం ఉంటుంది.

2004 ఎన్నికలలో దుగ్గిరాల అసెంబ్లీ నుండి ఓటమి పొందిన చందు సాంబశివరావు ఈ నియోజకవర్గ భాద్యతలను స్వీకరించి పార్టీని నమ్ముకుని పార్టీకి వీరి సేవలను అందించారు. వీరి నియోజకవర్గమునుండి Z.P. చైర్స్ పర్సన్ ఎన్నుకోబడినది.ఇచ్చట కొల్లిపర కాంగ్రెస్సు కు కంచుకోటగా ఉంది. వీరిని ఎదుర్కొని పార్టీకి సేవ చేయటం మామూలు విషయం కాదు.

పునర్విభజన అనంతరం తెనాలి నియోజకవర్గం నందు దుగ్గిరాల నియోజకవర్గంలోని కొల్లిపర మండలం మొత్తము మరియు కొలకలూరు, హఫ్పేట, గ్రామములలోని 55,000 మంది ఓటర్లు వీరికి పరిచయస్తులు.ఈ నియోజకవర్గంలో కాపు సామజికవర్గము నుండి ఓట్లు ఎక్కువ సంఖ్యలోనుండుట (12% ఓటర్లు) కావున చందు సాంబశివరావు గారు (విద్యావేత్త, శాస్త్రవేత్త, ఐటి మరియు కంప్యూటర్ నిపుణుడు.నిజం చెప్పాలంటే వీరు దుగ్గిరాల నుండి పోటీ చేసేటప్పుడు వీరి యొక్క బయో డేటా ప్రజలకు తెలియదు) పోటీ చేస్తే గత నియోజకవర్గం నందు వున్న సానుభూతి పని చేస్తుంది.

2004 ఎన్నికలలో కాంగ్రెసు సునామి గాలిలో అందరూ కొట్టుకుపోయారు. చందు సాంబశివరావు గాక ఎవరైనా ఐతే వెంకట రెడ్డి గారు 30,000 మెజారిటి తో గెలిచేవారు.

2004 ఎన్నికలలో!
కాంగ్రెసు పార్టీకి రెడ్డి, కాపు, S.C. సామజిక వర్గాల మద్దతు ఉండేది.
తెలుగు దేశం పార్టీకి కమ్మ, B.C. వర్గాల మద్దతు ఉండేది.
నేడు ప్రజారాజ్యం పార్టీకి కాపు సామజిక వర్గం సహకరిస్తోంది. కావున కాంగ్రెసు పార్టీకి 4.5% మేర నష్టం జరుగుతోంది. కాబట్టి కాంగ్రెసు పార్టీకి తెనాలి నియోజకవర్గా విజయం నల్లేరు మీద నడక అనుకునేవారు.కాని అది సాధ్యం కాదు.ఈ నియోజకవర్గం నుండి గెలుపు, ఓటములు చాలా తక్కువ మెజారిటి తో వస్తాయి. కాపు అభ్యర్దిని రంగంలో దించితే వారి యొక్క సామజిక వర్గం నుండి 30% ఓట్లు చీల్చ గలుగుతాడు.చందు సాంబశివరావు గారు వివాద రహితుడు అందుచే అన్ని సామజిక వర్గాల నుండి ఆయనకు మద్దతు లభించును.

5, ఫిబ్రవరి 2009, గురువారం

నందమూరి రామాయణం

ఆత్మీయులైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు,
నమస్కారము.
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఆంధ్రులు ఆప్యాయంగా "అన్న" అని పిలుచుకొన్న మహనీయుడు, మనపార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు.
ఆయనజీవిత జీవిత చరిత్రను "నందమూరి రామాయణం" అనే అల్బమ్ గా రూపొందించే అవకాశం నాకు కలగటం నా అదృష్టంగా భావిస్తున్నాను.పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో 'రజతోత్సవ మహానాడు'న ఈ సి.డి.ని మన ప్రియతమా నాయకులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆవిష్కరించిన విషయం మీకు తెలిసిందే.
బడుగు, బలహీన, కార్మిక, కర్షక, వర్గాలను రాజకీయ భాగస్వాముల్ని చేసుకొని, సామజిక న్యాయం కోసం నూతన, గుణాత్మకమైన రాజకీయ పంథాను అనుసరించిన "అన్న" గారి ఆలోచనా సరళి భావితరాలకు స్ఫూర్తిదాయకం.
ఆ మహనీయుని జీవిత చరిత్రను, తెలుగుజాతి ఔన్నత్యానికి ఆయన చేసిన కృషిని నవతరానికి తెలియచేయుటలో ఈ సి.డి. ఉపయుక్తం కాగలదని నా నమ్మకం.

భవదీయుడు
చందు సాంబశివరావు
టి.డి.పి. ఇంచార్జి,
దుగ్గిరాల నియోజకవర్గము.

19, డిసెంబర్ 2008, శుక్రవారం

శ్రీ చందు సాంబశివరావు

శ్రీ చందు సాంబశివరావు


శ్రీ చందు సాంబశివరావు గారు 09-09-1964 న గుంటూరు జిల్లా, కాకర్లమూడి గ్రామంలో శ్రీ చందు వీరరగావయ్య, బసవపూర్ణమ్మ దంపతులకు జన్మించారు.ఒక సామాన్య రైతు కుటుంబంలోజన్మించిన చందు సాంబశివరావు గారు ప్రాథమిక విద్యను స్వగ్రామంలోనూ,ప్రాథమికోన్నత విద్యను కుచ్చెళ్ళపాడు, అనంతవరం గ్రామాలలో పూర్తి చేశారు.

తెనాలిలోని వి.ఎస్.అర్. & ఎన్.వి.అర్. కళాశాలలో ఇంటర్మీడియట్ ముగించి, కర్ణాటక రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి 1986 లో బి.ఈ. డిగ్రీ పొందిన తదుపరి భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) లో శాస్త్రవేత్తగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.విక్రం సారాభాయి అంతరిక్ష కేంద్రం (వి.ఎస్.ఎస్.సి.,తిరువునంతపురం) లో 1992 వరకు బాధ్యతలు నిర్వ హిస్తూ ఆ తదుపరి ఉన్నత విద్య కోసంఅమెరికా వెళ్లారు.

యూనివర్సిటీ ఆఫ్ కెంటకి,యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ లలో రెండు యం.ఎస్. డిగ్రీలు సంపాదించిన తదుపరి నాసా (NASA) లో ఇంజనీరుగా బాధ్యతలు చేపట్టినారు 1992 నుండిఅమెరికా లో నివసిస్తున్న మన చందు పలు బహుళజాతి సంస్థలలో వివిధ హోదాలలో పదవీబాధ్యతలు నిర్వహిస్తూనే జాన్స్ హాప్ కిన్స్ యునివర్సిటీలో ఎం.బి.ఎ. డిగ్రీ సంపాదించారు.వారాంతపు దినాలలోవర్జీనియా రాష్ట్రంలోని కమ్యూనిటీ కాలేజీలలో ప్రొఫెసర్ గా 5 సంవత్సరాలు ఐ.టి. మరియు వాణిజ్య విభాగాలలో వివిధ కోర్సులు బోధించుట మన చందు సాంబశివరావు గారి విద్యాతృష్ణకు నిదర్శనం.

సర్టిఫైడ్ ప్రోజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ (పి.ఎం.పి.) అయిన మన చందు వివిధ అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు.ఐ.టి. రంగంలోనూ , మేనేజ్ మెంట్ రంగంలోనూ అత్యున్నతగుర్తింపు పొందిన భారతీయులలో మన చందు గారిది ప్రత్యేక స్థానం.

అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి.ప్రాంతంలో స్థిరపడిన మన చందు సాంబశివరావు గారు ఆ ప్రాంతపు తెలుగు కమ్యూనిటీ మరియు తానా కార్యక్రమాలను జయప్రదం చేయుటకు తోడ్పడినారు.

ఎన్.ఆర్.ఐ. గ స్థిరపడిన మన చందు సాంబశివరావు గారు జన్మభూమి ఫై మమకారంతో మన వాళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.విద్యారంగంలోనూ, ప్రకృతి విపరీత్యాల బాధితులకు, ఆరోగ్య రంగానికి ఆర్ధిక సహకారం అందించారు.అంతే కాకుండా పలు ప్రాంతాలలోని గ్రామాలలో వయోవృద్ధులకు , వికలాంగులకు, పేదల అభివృద్ధి కొరకు ఆర్ధికంగా చేయూతనిస్తూ, మిత్రులు, సహోద్యోగులను కూడా ఈ కార్యక్రమాలలో భాగస్వామ్యులను చేసారు.ఆయా గ్రామ ప్రజల కోరిక మేరకు పలు గ్రామాలలో పాఠశాలలు, దేవాలయాలు, చర్చిలు, మసీదుల నిర్మాణానికి, అభివృద్ధికి తనవంతు ఆర్ధిక సహయాయ సహకారాలను అందించారు.

ఈ నేపద్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థకు మన చందు సాంబశివరావు గారు అందించిన సేవలకు గుర్తింపుగా, మన రాష్ట్ర గవర్నర్ శ్రీ ఎన్.డి.తివారి గారు ప్రత్యేక అవార్డును ప్రదానం చేశారు.

ప్రఖ్యాత రచయిత, తన మేనమామ కీర్తి శేషులు శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని పలు తెలుగు రచయితలను, కళాకారులను అభినందిస్తూ, ఆదరిస్తూ, మన సంస్కృతి, సంప్రదాయాలపై తమకున్న మక్కువను చాటుకొంటూ సాహిత్య కళారంగాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

తెలుగు జాతిని అభివృద్ధి పరచాలనే తపన మన చందు సాంబశివరావు గారిని క్రియాశీలక రాజకీయాల వైపు మళ్ళించింది.

ఈ నేపద్యంలో మన 'అన్న' స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి నిస్వార్ద సేవ,శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనా విధానాలు, పరిపాలనా దక్షతా, మన చందు గారిని ఎంతో ప్రేరేపించాయి.మిత్రుల ప్రోత్సాహంతో మరియు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 2004 అసెంబ్లీ ఎన్నికలలో దుగ్గిరాల నియోజకవర్గం నుండి టి.డి.పి. అభ్యర్ధిగా పోటీ చేశారు.

2004 నుండి దుగ్గిరాల నియోజకవర్గ టి.డి.పి. ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రజాసేవకు నియోజక వర్గ ప్రజానీకంతో మమేకమై, ప్రజల అభివృద్ధికి, పార్టి అభివృద్ధికి కృషి చేస్తున్నారు.ఇక్కడే ఉంటూ, పూర్తి సమయాన్ని పార్టి కార్యకలాపాలకు కేటాయిస్తున్న మన చందు సాంబశివరావు గారి కృషికి తోడు, అన్ని వర్గాల ప్రజానీకం, స్థానిక, జిల్లా మరియు రాష్ట్ర నాయకులు అందిస్తున్న ప్రోత్సాహం దుగ్గిరాల నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలను సాధించటానికి దోహదపడింది.

అవసరమైనప్పుడల్లా తమ విలువైన సమయాన్ని ఈ ప్రాంతపు కళాశాలల్లో సేమినార్స్ కొరకు వినియోగిస్తూ, విద్యార్ధుల బంగరు భవితకై తల్లిదండ్రుల, అధ్యాపకుల నిరంతర కృషిలో మన చందు సాంబశివరావు గారు భాగస్వామ్యులవుతున్నారు.ఈ కార్యక్రమాలను అందరి నుండి, మరీ ముఖ్యంగా యువతనుండి అందుతున్న విశేష స్పందన మరిన్ని కార్యక్రమాలను చేపట్టడానికి దోహదపడుతున్నది.

చిన్నప్రయం నుండి కులమతాలకతీతంగా అపరిచితులను పరిచితులుగా చేసుకొంటూ,పరిచితులలో నిజమైన స్నేహితులను వెతుక్కుంటూ మన చందు సాంబశివరావు గారు ఎంతో మందికి ఆప్త మిత్రులు అవటమే కాక, మిత్రులే తమ సంపదని సగర్వంగా చెప్పుకొంటూ వుంటారు.ప్రాథమిక స్థాయి నుండి ఇప్పటి వరకు తన జీవిత మార్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఉపాధ్యాయులే తనకు దైవ సమానులుగా భావిస్తూ, వారిని గుర్తించి, గౌరవిస్తూ, ఆదరించడం మన చందు సాంబశివరావు గారి ప్రత్యేకత.

నిస్వార్ధ ప్రజాసేవే జీవిత లక్ష్యంగా చేసుకున్న తమ మామగారైన శ్రీ గరికపాటి వెంకటనారాయణ దొర (దొరస్వామి) గారి ఆశీస్సులతో మరియు తమ శ్రీమతి చందు అనురాధ గారి పూర్తి సహకారంతో మన చందు సాంబశివరావు గారు చేపట్టి నిర్వహిస్తున్న అన్ని ప్రజాహిత కార్యక్రమాలు విజయవంతమయ్యాయి.
చందు సాంబశివరావు
M.S., M.S., M.B.A., P.M.P.


చందు అనురాధ (భార్య)
చందు భరత్ (కుమారుడు)
చందు పృధ్వీ (కుమారుడు)